వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : గురు పౌర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కొత్త రోడ్డులో ఉన్న సాయిబాబా దేవాలయంలో మేయర్ దర్ని మధుకర్, టీపీసీసీ సభ్యుడు నూకల రమేష్తో కలిసి బుధవారం సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మేయర్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి సేవా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.ఈ సందర్భంగా మేయర్ దర్ని మధుకర్ మాట్లాడుతూ, గురు పౌర్ణిమ ఆధ్యాత్మికత, గురుభక్తి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ వేల్పుల రవీందర్, 7వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చిలుక మల్లేష్, కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం