వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా మంగళవారం జిల్లా కలెక్టర్ కె.హరిత సిర్పూర్ నియోజకవర్గ మండలాల తహసిల్దార్లు, ఏపీఎంలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లు, బూత్ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మ్యాపింగ్ శాతం తక్కువగా ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పంచాయతీ కార్యదర్శులు బూత్ స్థాయి అధికారులకు పూర్తి సహకారం అందించాలని నిర్దేశించారు.అనంతరం వరి ధాన్యం కొనుగోలు, గోనె సంచుల లభ్యత, భూభారతి దరఖాస్తుల పరిశీలన, ధ్రువపత్రాల జారీ, పెండింగ్ అంశాలపై తహసిల్దార్లతో సమీక్ష జరిపారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలని, అకాల వర్షాల నేపథ్యంలో గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉంచాలని సూచించారు. భూభారతి సదస్సుల్లో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని, ధ్రువపత్రాలు నిర్ణీత గడువులోగా జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.
Admin
వాస్తవ గమ్యం