వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, జూలై 4: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ ప్రథమ సంవత్సరం మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 6న స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నట్లు టీజీఎస్డబ్ల్యూఆర్ఐఈఎస్ సమన్వయకర్త రామ కళ్యాణి తెలిపారు.బాలికలకు లక్షెట్టిపేట, బాలురకు జైపూర్ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఉదయం 9 గంటల నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లు, జిరాక్స్ ప్రతులతో హాజరు కావాలని సూచించారు.మార్చి–2026లో ఎస్ఎస్సీ/సీబీఎస్ఈ/ఐసీఎస్ఈ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పదో తరగతి మెరిట్, రిజర్వేషన్ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు అర్హులని, అడ్మిషన్ పొందిన వారు ఒరిజినల్ సర్టిఫికెట్లు సమర్పించి వెంటనే కళాశాలలో చేరాలని రామ కళ్యాణి తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం