Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం కేంద్రంలో చారిగామ్ గ్రామంలో అక్రమ మైనింగ్ పై మైనింగ్, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. మైనింగ్ ఏడీ, ఆర్ఐ, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితరులు స్థలాన్ని పరిశీలించి సర్వే చేపట్టారు. అక్రమ తవ్వకాలు జరిగిన భూములకు నలుగురు పట్టాదారులు ఉన్నట్లు గుర్తించగా, ఒక్కరు మాత్రమే హాజరయ్యారు. మిగతా వారికి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిపించనున్నట్లు తెలిపారు.తవ్విన మట్టి పరిమాణాన్ని అంచనా వేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు, జరిమానాలు విధిస్తామని అధికారులు స్పష్టం చేశారు.
Admin
Vastava Gamyam