వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మందమర్రి, జూన్ 30: సింగరేణి అధికారుల సంఘం పిలుపు మేరకు మందమర్రి ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం ఎదుట మంగళవారం రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అధికారులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మందమర్రి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్. రమేష్ మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఆర్పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్గ్రేడేషన్ అమలు చేయాలని, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, అధికారుల పదోన్నతులు, బదిలీల్లో పారదర్శకత కల్పించడంతో పాటు సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి అధికారులు సంస్థను తమ సొంత సంస్థగా భావించి సమయాభావాన్ని లెక్కచేయకుండా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ, నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆయన అన్నారు. గత నెల రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు..ఇలాంటి పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వెంటనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి అధికారుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుని పీఆర్పీ బకాయిల చెల్లింపు, పే అప్గ్రేడేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్ల పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడంతో పాటు సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బసవరాజు, ఉపాధ్యక్షుడు వర్ధన్, డాక్టర్ మధు, సంయుక్త కార్యదర్శి రవి, ఖజాంచి సరిత, ఎం. సంతోష్, శ్యామ్, రాజ్కుమార్, మహబూబ్ ఖాన్తో పాటు మందమర్రి ఏరియాకు చెందిన సీనియర్, జూనియర్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం