Wednesday, 29 July 2026 09:19:52 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

మందమర్రి జీఎం కార్యాలయం వద్ద అధికారుల సంఘం రెండో రోజు రిలే నిరాహార దీక్ష

Date : 30 June 2026 07:28 PM Views : 292

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : మందమర్రి, జూన్ 30: సింగరేణి అధికారుల సంఘం పిలుపు మేరకు మందమర్రి ఏరియా అధికారుల సంఘం ఆధ్వర్యంలో స్థానిక జీఎం కార్యాలయం ఎదుట మంగళవారం రెండో రోజు కూడా నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈ సందర్భంగా అధికారులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మందమర్రి ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు ఎస్. రమేష్ మాట్లాడుతూ, రెండు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న పీఆర్‌పీ బకాయిలను వెంటనే చెల్లించాలని, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్‌మెంట్, అధికారుల పదోన్నతులు, బదిలీల్లో పారదర్శకత కల్పించడంతో పాటు సింగరేణికి రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సింగరేణి అధికారులు సంస్థను తమ సొంత సంస్థగా భావించి సమయాభావాన్ని లెక్కచేయకుండా సంస్థ అభివృద్ధికి కృషి చేస్తున్నప్పటికీ, నేడు నిరసన కార్యక్రమాలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడటం బాధాకరమని ఆయన అన్నారు. గత నెల రోజులుగా నిరసనలు కొనసాగుతున్నప్పటికీ యాజమాన్యం గానీ, ప్రభుత్వం గానీ స్పందించకపోవడం ఆందోళనకరమని పేర్కొన్నారు..ఇలాంటి పరిస్థితి కొనసాగితే సంస్థ మనుగడపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని హెచ్చరించారు. వెంటనే యాజమాన్యం, ప్రభుత్వం స్పందించి అధికారుల న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుని పీఆర్‌పీ బకాయిల చెల్లింపు, పే అప్‌గ్రేడేషన్ అమలుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరారు. డిమాండ్ల పరిష్కారంలో మరింత జాప్యం జరిగితే నిరసన కార్యక్రమాలను మరింత ఉధృతం చేయడంతో పాటు సమ్మెకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి బసవరాజు, ఉపాధ్యక్షుడు వర్ధన్, డాక్టర్ మధు, సంయుక్త కార్యదర్శి రవి, ఖజాంచి సరిత, ఎం. సంతోష్, శ్యామ్, రాజ్‌కుమార్, మహబూబ్ ఖాన్‌తో పాటు మందమర్రి ఏరియాకు చెందిన సీనియర్, జూనియర్ అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

BAIRY RAVINDAR

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: