వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి బోనాల జాతర తేదీ ఖరారైంది. ఈ ఏడాది జూలై 26వ తేదీన (ఆదివారం) జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మరియు కుల పెద్దలు అధికారికంగా ప్రకటించారు. ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం, గాంధరికీల్లా ఆలయ కమిటీ,ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల జూలై 26 గాంధారి ఖిల్లా మైసమ్మ ఆలయం కమిటీ మరియు ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం ఆధ్వర్యంలో.ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమూల్యమైన ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.ఈ సమావేశంలో నాయకపోడ్ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొమ్ముల బాపు, ఆలయ కమిటీ చైర్మన్ రొడ్డ రమేష్, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న, జిల్లా జనరల్ సెక్రటరీ సంజీవ్, తుడుందెబ్బ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జెక శేఖర్, ఉపాధ్యక్షులు లౌడం రాజుకుమార్, అలాగే ముఖ్య నాయకులు బైరినేని లక్ష్మణ్, బద్ది శ్రీనివాస్, చేనెని ప్రదీప్ మరియు ఆలయ పూజారులు రమేష్, శ్రీధర్, అనిల్, రాజేష్, లక్ష్మణ్, కూన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం