Tuesday, 28 July 2026 08:07:46 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

​జూలై 26న వైభవంగా ‘శ్రీ శ్రీ శ్రీ గాంధారి ఖిల్లా మైసమ్మ బోనాల జాతర’

Date : 12 July 2026 06:33 PM Views : 161

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన గాంధారి ఖిల్లా మైసమ్మ తల్లి బోనాల జాతర తేదీ ఖరారైంది. ఈ ఏడాది జూలై 26వ తేదీన (ఆదివారం) జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ మరియు కుల పెద్దలు అధికారికంగా ప్రకటించారు. ​ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం, గాంధరికీల్లా ఆలయ కమిటీ,ఆదివాసీ నాయకపోడ్ హక్కుల పరిరక్షణ కమిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ నెల జూలై 26 గాంధారి ఖిల్లా మైసమ్మ ఆలయం కమిటీ మరియు ఆదివాసీ నాయకపోడ్ సేవాసంఘం ఆధ్వర్యంలో.ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ జాతరకు తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో, ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అమూల్యమైన ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా ఈ బోనాల ఉత్సవాలు జరగనున్నాయి.ఈ సమావేశంలో నాయకపోడ్ సేవాసంఘం జిల్లా అధ్యక్షులు పెద్ది భార్గవ్, రాష్ట్ర జనరల్ సెక్రటరీ కొమ్ముల బాపు, ఆలయ కమిటీ చైర్మన్ రొడ్డ రమేష్, హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు గంజి రాజన్న, జిల్లా జనరల్ సెక్రటరీ సంజీవ్, తుడుందెబ్బ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జెక శేఖర్, ఉపాధ్యక్షులు లౌడం రాజుకుమార్, అలాగే ముఖ్య నాయకులు బైరినేని లక్ష్మణ్, బద్ది శ్రీనివాస్, చేనెని ప్రదీప్ మరియు ఆలయ పూజారులు రమేష్, శ్రీధర్, అనిల్, రాజేష్, లక్ష్మణ్, కూన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :