వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణంలో శాఖాహార ఆవశ్యకతపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఆచార్య శ్రీనివాస్ దంపతుల ఆధ్వర్యంలో ఆదివారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని బస్టాండ్ నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ రామన్ కాలనీ, మార్కెట్ ప్రాంతం వరకు కొనసాగింది. ర్యాలీలో పాల్గొన్న శాకాహార ప్రియులు "జీవహింస వద్దు – శాఖాహారం ముద్దు", "పశువుల రక్షణే మానవాళికి రక్షణ", "శాఖాహారమే సంపూర్ణ పోషకాహారం" వంటి నినాదాలతో కూడిన ఫ్లెక్స్లు, ఫ్లిప్ కార్డులు, బ్యానర్లు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆచార్య శ్రీనివాస్ దంపతులు మాట్లాడుతూ, జీవహింస కారణంగా భవిష్యత్తులో మానవాళి అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని, పర్యావరణ పరిరక్షణకు కూడా శాఖాహారం ఎంతో దోహదపడుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మాంసాహారాన్ని తగ్గించి శాఖాహారాన్ని అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ అవగాహన ర్యాలీలో పట్టణానికి చెందిన శాకాహార ప్రియులు, పలువురు ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం