Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణిలో గుర్తింపు పొందిన కార్మిక సంఘాల చేతగానితనం వల్లే గత 14 నెలలుగా మెడికల్ బోర్డు సమావేశాలు జరగడం లేదని హెచ్ఎంఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, జెబిసీసీఐ సభ్యులు రియాజ్ అహ్మద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బెల్లంపల్లి ఏరియాలోని ఖైరిగుడా ఓసీపి వద్ద హెచ్ఎంఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు పతెం రాజబాబు అధ్యక్షతన బుధవారం ఘనంగా గేట్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన రియాజ్ అహ్మద్ కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ.గత 14 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకపోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న అనేకమంది కార్మికులు విధులు నిర్వహించలేక నరకయాతన అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం తక్షణమే స్పందించి, కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెల కనీసం రెండు సార్లయినా మెడికల్ బోర్డు సమావేశాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.ఉద్యోగ నియామకాల కోసం ఎంతో కాలంగా కళ్లల్లో ఒత్తులు వేసుకుని ఎదురుచూస్తున్న కార్మిక కుటుంబ సభ్యులకు ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా, పాత విధానంలోనే ఒకేసారి నియామక పత్రాలను అందజేయాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.కార్మికుల సమస్యల పరిష్కారానికి అన్ని కార్మిక సంఘాలు కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని రియాజ్ అహ్మద్ అభిప్రాయపడ్డారు. అలా కాకుండా ఏఐటీయూసీ నాయకత్వం ఇతర సంఘాలను సంప్రదించకుండా, ఒంటరిగా యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇవ్వడం కార్మికులను నట్టేట ముంచడమేనని విమర్శించారు. గుర్తింపు సంఘానికి నిజంగానే కార్మిక సమస్యలను పరిష్కరించాలనే చిత్తశుద్ధి ఉంటే.అన్ని సంఘాలను కలుపుకొని ఉమ్మడిగా సమ్మె నోటీసు ఇవ్వాలని హెచ్ఎంఎస్ తరపున సవాల్ విసిరారు.ఈ గేట్ మీటింగ్లో హెచ్ఎంఎస్ బ్రాంచ్ సెక్రటరీ ఎం. శివారెడ్డి, పిట్ సెక్రెటరీ దుర్గం వెంకటేష్, అసిస్టెంట్ పిట్ సెక్రెటరీ ఎస్. కుమార్ గౌడ్, ఏరియా ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఎస్కే ఇనూస్, ఏరియా క్లర్క్స్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ కళ్యాణ్ కుమార్ మరియు పెద్ద సంఖ్యలో సింగరేణి కార్మికులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్న
Admin
Vastava Gamyam