వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ జిల్లాలో ఆర్టీసీ సమస్యల పరిష్కారం,సంస్థ రక్షణ కోసం ఏప్రిల్ 22 మొదటి డ్యూటీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు జేఏసీ పిలుపునిచ్చింది.ఈ మేరకు ఆసిఫాబాద్ డిపోలో జరిగిన గేట్ మీటింగ్లో కార్మికులు సమ్మెలో పాల్గొనాలని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపునిచ్చారు.ప్రభుత్వ హామీలు అమలు కాకపోవడం వల్లే సమ్మెకు దిగుతున్నామని పేర్కొన్నారు.వేతన సవరణ,ప్రభుత్వంలో విలీనం,బకాయిల చెల్లింపు,ఉద్యోగ భద్రత,ప్రైవేటీకరణ నిలిపివేత,ఖాళీల భర్తీ వంటి డిమాండ్లు ప్రధానంగా ఉన్నాయి.సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె కొనసాగుతుందని హెచ్చరించారు.
Admin
వాస్తవ గమ్యం