వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూలై 1: మందమర్రి లయన్స్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు బుధవారం మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపిండి రాజలింగును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి పుష్పగుచ్ఛం అందజేశారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ శ్రీ సొత్తుకు సుదర్శన్ రావు, నూతన అధ్యక్షుడు శ్రీ పెండ్యాల గౌతమ్ చారి, ట్రెజరర్ శ్రీ బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లు శ్రీ బింగి రాజన్న, శ్రీ కొక్కుల మధు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శ్రీ తుంగపిండి రాజలింగు మాట్లాడుతూ, సమాజ సేవలో లయన్స్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని కొనియాడారు. విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణతో పాటు వివిధ సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు క్లబ్ చేస్తున్న సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.అదేవిధంగా ఇటీవల మందమర్రి లయన్స్ క్లబ్ అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీ పెండ్యాల గౌతమ్ చారి, ట్రెజరర్గా ఎన్నికైన శ్రీ బుర్ర ఆంజనేయులు, డైరెక్టర్లుగా ఎన్నికైన శ్రీ బింగి రాజన్న, శ్రీ కొక్కుల మధు కి అభినందనలు తెలిపారు. వారి పదవీకాలంలో క్లబ్ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షించారు.
Reporter
వాస్తవ గమ్యం