వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి, జూన్ 27: పదవీ విరమణ చేయనున్న జీఎం విజిలెన్స్(కార్పొరేట్) శ్రీ పి.రాజీవ్ కుమార్ శనివారం మందమర్రి ఏరియాను సందర్శించారు.ఈ సందర్భంగా మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ కార్యాలయంలో ఆయనకు ఘనంగా ఆత్మీయ సన్మానం నిర్వహించారు.మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఎన్. రాధాకృష్ణతో పాటు ఏరియా ఉన్నతాధికారులు శ్రీ పి. రాజీవ్ కుమార్ను శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సుదీర్ఘ సేవాకాలంలో సంస్థ అభివృద్ధికి అందించిన విశిష్ట సేవలను కొనియాడుతూ, పదవీ విరమణ అనంతరం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఏరియా ఈ అండ్ ఎం బాలాజీ భగవతి జా, డీజీఎం (ఐఈడీ) కె. కిరణ్ కుమార్, డీవైజీఎం (ఏఎస్ఓ) వి. మురళి, డీజీఎం (సర్వే) భుఖ్య దేశాయ్, డీజీఎం (సివిల్) షేక్ మదీనా భాష, ఫారెస్ట్ అధికారి నవీన్, క్వాలిటీ అధికారి ప్రదీప్, డీజీఎం (పర్సనల్) విజయ్ సందీప్, ఎస్. రాజ్ కుమార్, మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్) తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం