వాస్తవ గమ్యం / తెలంగాణ / కరీంనగర్ : హుజూరాబాద్ పట్టణంలోని పురాతన సీతారామచంద్ర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ వార్షికోత్సవాన్ని గురువారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువజామునే ఆలయ అర్చకులు శ్రీధరాచార్యులు, రామారావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, సుదర్శన హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భారీగా రావడంతో ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
Reporter
వాస్తవ గమ్యం