వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్లో జరిగిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక సమావేశంలో అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ హరిత తెలిపారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, రైతు భీమా, కళ్యాణ లక్ష్మి వంటి పథకాల ద్వారా కోట్ల రూపాయలు లబ్ధిదారులకు అందించినట్లు వివరించారు.ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పురోగతిలో ఉందని, రెండో విడతకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. విద్య, వ్యవసాయం, మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం