Saturday, 13 June 2026 10:42:13 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

​ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్ సీతారాంపల్లి జెడ్పీ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ ​మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశం

Date : 09 April 2026 04:59 PM Views : 273

Vastava Gamyam - తెలంగాణ / : ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ​ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పరిసరాలు, మరియు మూత్రశాలలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ​ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ, విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ​ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని నిర్ణీత సమయానికి అందించాలని స్పష్టం చేశారు.పాఠశాల భవనాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే గుర్తించి, యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లలకు వివరించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :