Wednesday, 29 July 2026 11:22:46 PM
# ఎన్యుమరేషన్ ఫారాల డిజిటైజేషన్‌ను నిశితంగా పర్యవేక్షించాలి: # హెచ్ఐవి/ఎయిడ్స్ నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు # పట్నపూర్ గ్రామంలోగురుపౌర్ణమి సందర్భంగా వైద్య శిబిరం* # భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన మున్సిపల్ యంత్రాంగం # గురు పౌర్ణిమ సందర్భంగా సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మేయర్ దర్ని మధుకర్ # అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి:

​ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యే లక్ష్యం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్ సీతారాంపల్లి జెడ్పీ హైస్కూల్ ఆకస్మిక తనిఖీ ​మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని ఆదేశం

Date : 09 April 2026 04:59 PM Views : 321

వాస్తవ గమ్యం / తెలంగాణ / : ప్రభుత్వ పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు. గురువారం నస్పూర్ మండలంలోని సీతారాంపల్లి గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. ​ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, పరిసరాలు, మరియు మూత్రశాలలను కలెక్టర్ నిశితంగా పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను, ఇతర రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ. ​ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కావాల్సిన అన్ని మౌలిక వసతులను కల్పిస్తూ, విద్యారంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ​ఉపాధ్యాయులు విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో, సృజనాత్మకంగా బోధించాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం అమలులో ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదని, మెనూ ప్రకారం నాణ్యమైన, పౌష్టికాహారాన్ని నిర్ణీత సమయానికి అందించాలని స్పష్టం చేశారు.పాఠశాల భవనాల్లో ఏవైనా మరమ్మతులు ఉంటే వెంటనే గుర్తించి, యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ఎండ దెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పిల్లలకు వివరించాలని సూచించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, విద్యాశాఖ అధికారులు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :