వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి పట్టణంలోని దొరల బంగ్లా ఏరియాలో యథేచ్ఛగా సాగుతున్న గుడుంబా అమ్మకాలను వెంటనే అరికట్టాలని బస్తీవాసులు డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో గొర్రె రామచందర్, కనకం రవీందర్, బచ్చలి సురేందర్, బత్తుల సరిత మాట్లాడుతూ.గత 25 ఏళ్లుగా ఇక్కడ గుడుంబా విక్రయాలు సాగుతున్నాయని మండిపడ్డారు. ఈ వ్యసనం వల్ల గత రెండేళ్లలోనే బస్తీలో 15 మంది ప్రాణాలు కోల్పోయారని, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే యువత కూడా పాడైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఆబ్కారీ (ఎక్సైజ్) శాఖ అధికారులు స్పందించి, దాడులు నిర్వహించి గుడుంబా అమ్మకాలను పూర్తిగా నిలిపివేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో సంపత్, వెంకటేశ్వర్లు, బాసాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం