వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భరోసా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులు, అత్యాచారాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక, కౌన్సెలింగ్ తదితర సేవలను వివరించారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ – అన్సేఫ్ టచ్, పోక్సో చట్టం , బాల్య వివాహ నిరోధక చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, చట్టాలపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు.అదేవిధంగా సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు కాల్ చేయాలని, భరోసా సహాయ నంబర్ 8712670561ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భరోసా టీం లీగల్ అడ్వైజర్ శైలజ, కౌన్సిలర్ శ్వేత, రిసెప్షనిస్ట్ సుమలత, సపోర్ట్ పర్సన్స్ సరిత, స్నిగ్ధ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం