Tuesday, 28 July 2026 03:08:40 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

భరోసా టీం ఆధ్వర్యంలో నర్సింగ్ కళాశాల విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం

Date : 07 July 2026 05:15 PM Views : 73

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆదిలాబాద్ : జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ చిత్తరంజన్ పర్యవేక్షణలో ఆసిఫాబాద్ ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో భరోసా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులు, అత్యాచారాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక, కౌన్సెలింగ్ తదితర సేవలను వివరించారు. విద్యార్థినులకు సేఫ్ టచ్ – అన్‌సేఫ్ టచ్, పోక్సో చట్టం , బాల్య వివాహ నిరోధక చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. విద్య ద్వారానే ఉన్నత భవిష్యత్తును నిర్మించుకోవచ్చని, చట్టాలపై అవగాహన ప్రతి విద్యార్థికి అవసరమని సూచించారు.అదేవిధంగా సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మొబైల్ ఫోన్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు, దుష్పరిణామాల గురించి వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు కాల్ చేయాలని, భరోసా సహాయ నంబర్ 8712670561ను సంప్రదించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో భరోసా టీం లీగల్ అడ్వైజర్ శైలజ, కౌన్సిలర్ శ్వేత, రిసెప్షనిస్ట్ సుమలత, సపోర్ట్ పర్సన్స్ సరిత, స్నిగ్ధ, ప్రభుత్వ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ పద్మలత, వైస్ ప్రిన్సిపాల్ పద్మ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :