వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్:జిల్లాలోని ఈదూలవాడ గ్రామ పంచాయతీ పరిధిలోని తేనుగూడ గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. గ్రామంలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని, స్థానిక సర్పంచ్ చిలుకూరి కళ్యాణి సతీష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు.గ్రామంలోని తాగునీటి బోర్వెల్కు తక్షణమే మరమ్మతులు చేయించి,నూతనంగా నల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా గ్రామస్థులకు తాగునీటి సౌకర్యాన్ని పునరుద్ధరించారు.ఈ సందర్భంగా సర్పంచ్ చిలుకూరి కళ్యాణి సతీష్ మాట్లాడుతూ, గ్రామ ప్రజల ప్రాథమిక అవసరాల తీర్చడమే తమ మొదటి ప్రాధాన్యతని, నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే ఈ బోర్వెల్ మరమ్మతులు చేపట్టినట్లు తెలిపారు. చాలా కాలంగా నీటి కోసం ఇబ్బంది పడుతున్న తమ సమస్యను త్వరితగతిన పరిష్కరించడం పట్ల తేనుగూడ గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, సర్పంచ్కు మరియు పంచాయతీ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ తాగునీటి సౌకర్యాల పునరుద్ధరణ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు మరియు అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నా వారిలో ముఖ్యులు.స్వప్న (పంచాయతీ సెక్రటరీ).మిట్ట సత్యనారాయణ (కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు) ఇగూరపు సంతోష్,సతీష్, రవి, సురేష్, వెంకటేష్, అరుణ్ మరియు స్థానిక గ్రామస్థులు.
Reporter
వాస్తవ గమ్యం