వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : రెబ్బెన బస్టాండ్ వద్ద 130 గ్రాముల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి గంజాయితో పాటు మోటరోలా జి-35 మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.7 వేలుగా పోలీసులు తెలిపారు.ఎస్సై ఎ. వెంకటకృష్ణ ఆధ్వర్యంలో గురువారం పోలీసులు రెబ్బెన బస్టాండ్ పరిసరాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా, పోలీసులను చూసి అనుమానాస్పదంగా పారిపోతున్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేయగా వారు జక్కులపల్లి గ్రామానికి చెందిన ధాగం సందీప్ (24), మంచిర్యాల కు చెందిన కొండగుర్ల్ రాజేందర్ ప్రసాద్ (19) గా గుర్తించారు. సందీప్ వద్ద ఉన్న పాలిథిన్ కవర్లో 130 గ్రాముల గంజాయి లభించినట్లు పోలీసులు తెలిపారు.నిందితులను విచారించగా. మహారాష్ట్రలోని బల్లార్షా ప్రాంతం నుంచి గంజాయిని కొనుగోలు చేసి రెబ్బెన మండలంలో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది. ఈ వ్యవహారంలో మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన ఇద్దరినీ జుడీషియల్ రిమాండ్కు తరలించారు. రెబ్బెన సీఐ ఎం. సంజయ్ మాట్లాడుతూ.. మండలంలో గంజాయి సాగు, రవాణా, విక్రయం, వినియోగానికి పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయికి యువత దూరంగా ఉండాలని, అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు. సమాచారం ఇచ్చేవారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.కార్యక్రమంలో ఎస్సై ఎ. వెంకటకృష్ణ, హెచ్సీ రవికుమార్, పీసీ నౌషద్ తదితర సిబ్బంది ఉన్నారు. గంజాయి పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచినందుకు ఉన్నతాధికారులు అభినందించారు.
Reporter
వాస్తవ గమ్యం