వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ఉద్యమ స్ఫూర్తితో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం తెలంగాణ జర్నలిస్ట్స్ అసోసియేషన్ (టిజెఎ) నిరంతరం కృషి చేస్తోందని సంఘం జిల్లా అధ్యక్షులు పార్వతి సురేష్ కుమార్ తెలిపారు. మంచిర్యాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ నెల 23న జిల్లా వ్యాప్తంగా టిజెఎ 12వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.జర్నలిస్టుల అక్రిడిటేషన్లు,హెల్త్ కార్డులు, ఇళ్ల స్థలాలు, బీమా వంటి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సంఘం పోరాడుతోందని స్పష్టం చేశారు. జిల్లాలోని ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్, వెబ్ మీడియా జర్నలిస్టులందరూ పెద్ద ఎత్తున సభ్యత్వం తీసుకుని సంఘాన్ని బలోపేతం చేయాలని, అలాగే ఆవిర్భావ వేడుకలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు డేగ ఆంజనేయులు, మాసు రాకేష్, సోదరి దుర్గయ్య, చిట్యాల వినీత్ తదితరులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం