Saturday, 13 June 2026 10:42:12 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

ప్రభుత్వ ఫలాలు ప్రజలకే అందాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా

ఖానాపూర్‌లో వైభవంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ సమావేశం

Date : 02 May 2026 04:22 PM Views : 52

Vastava Gamyam - తెలంగాణ / నిర్మల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు మరింత చేరువ చేయడమే ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ ప్రధాన ఉద్దేశ్యమని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. శనివారం ఖానాపూర్ పట్టణంలోని జేకే ఫంక్షన్ హాల్‌లో ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌తో కలిసి నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం 99 రోజుల ప్రత్యేక ప్రణాళికతో ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందన్నారు. ఖానాపూర్ నియోజకవర్గానికి 6,155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని, సుమారు 53 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని వివరించారు. రైతు భరోసా, రుణమాఫీ వంటి పథకాలతో పాటు, ఇటీవల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ.జిల్లాలో పారిశుధ్యం, విద్య, వైద్య రంగాల్లో పురోగతి సాధించామన్నారు. పదవ తరగతి ఫలితాల్లో నిర్మల్ జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.త్వరలోనే ఇందిరమ్మ జీవిత బీమా,పాఠశాలల్లో బ్రేక్ ఫాస్ట్ వంటి నూతన పథకాలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్నకళ్యాణి, సిపిఓ జీవరత్నం, మున్సిపల్ చైర్మన్ అంకం మౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :