వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: పట్టణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మందమర్రి ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులను ఘనంగా సన్మానించారు. పట్టణంలోని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడు గజ్జల చందర్, ప్రధాన కార్యదర్శి సలాముద్దీన్, కోశాధికారి సకినాల శంకర్లకు శాలువాలు కప్పి పూలమాలలతో సత్కరించారు.ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు మాట్లాడుతూ, తమపై చూపిన అభిమానానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సన్మానం తమ బాధ్యతలను మరింత పెంచిందని, జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంలో ఎల్లప్పుడూ ముందుండి పనిచేస్తామని పేర్కొన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ, నూతన ప్రెస్ క్లబ్ కమిటీ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణతో పాటు ప్రజలకు నిష్పక్షపాత, వాస్తవ సమాచారాన్ని అందించడంలో ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం పట్టణ నాయకులు, సభ్యులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం