వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : సింగరేణి సి హెచ్ పి గోలేటి ఎక్స్ రోడ్డు నందు వెలిసిన శ్రీ దుర్గా అమ్మవారి 7వ వార్షికోత్సవ వేడుకలు శనివారం సింగరేణి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఆలయ పూజారులు, వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారికి నిర్వహించిన ప్రత్యేక అభిషేక మహోత్సవం భక్తులకు కనులపండువగా నిలిచింది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సింగరేణి సి హెచ్ పి ఉన్నతాధికారులు, కార్మికులు మరియు ఆలయ కమిటీ సభ్యులు తమ సతీసమేతంగా పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులకు కమిటీ సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలను పురస్కరించుకుని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ (జిఎం)ని ఆలయ కమిటీ ప్రత్యేకంగా ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ "జై మాతా ది.. జై సింగరేణి" అంటూ చేసిన భక్తిస్మరణలతో ఆలయ పరిసరాలు మారుమోగాయి. కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం