వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్తో పాటు నిరంతర పెట్రోలింగ్ నిర్వహించడం అత్యవసరమని మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్ అన్నారు. శనివారం ఆయన మందమర్రి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించిన డీసీపీ, స్టేషన్ ఆవరణను పరిశుభ్రంగా ఉంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. స్టేషన్ పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును పరిశీలించడంతో పాటు రిసెప్షన్ సెంటర్ రికార్డులను తనిఖీ చేశారుఅలాగే నమోదవుతున్న కేసుల వివరాలు, రౌడీషీటర్ల సమాచారం, నేరాల స్వభావం, కేసుల పురోగతి తదితర అంశాలపై ఆరా తీశారు. రోడ్డు భద్రతపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.నేరాల నియంత్రణకు విజిబుల్ పోలీసింగ్ అత్యవసరమని, నిరంతర పెట్రోలింగ్తో పాటు ఆకస్మిక వాహన తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల క్రయవిక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించి కట్టడి చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్టేషన్ పరిధికి సంబంధించిన వివిధ అంశాలను సీఐ రమేష్ డీసీపీకి వివరించారు.ఈ తనిఖీల్లో బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్, మందమర్రి సీఐ రమేష్, ఎస్ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం