వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కెరమేరి మండలంలోని అసంపూర్తి వంతెనలు, బీటీ రోడ్డు సమస్యపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ కి ఫిర్యాదు పరండోలి: అనర్పల్లి, లక్మాపూర్ గ్రామాల వద్ద అసంపూర్తిగా ఉన్న వంతెనలు, పరండోలి గ్రామం నుంచి ఉమ్రి క్రాస్ రోడ్ వరకు బీటీ రోడ్డు సమస్యపై శుక్రవారం నాడు హైదరాబాదులోని కార్యాలయంలో జాతీయ ఎస్టీ కమిషన్ న్యూఢిల్లీకి ఫిర్యాదు చేసినట్లు ఎన్ హెచ్ ఆర్ సి జిల్లా చైర్మన్ రాథోడ్ రమేష్ తెలిపారు. ఈ సమస్యల కారణంగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ త్వరలో సంబంధిత గ్రామాలను సందర్శించనున్నట్లు సమాచారం. సమస్యలను పరిశీలించి నివేదిక తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే 30 రోజుల్లోగా జిల్లా కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖ, అటవీ శాఖలకు కమిషన్ నుంచి నోటీసులు అందనున్నాయని తెలిపారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కమిషన్ ఆదేశించే అవకాశం ఉందని రాథోడ్ రమేష్ పేర్కొన్నారు
Reporter
వాస్తవ గమ్యం