Sunday, 13 September 2026 08:39:07 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

ఉరి వేసుకొని తాపీ మేస్త్రి ఆత్మహత్య

Date : 05 May 2026 06:40 PM Views : 144

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : మద్యపానానికి బానిసైన గజ్జెల్లి అశోక్ (35), అనే తాపీ మేస్త్రి రెబ్బెన మండలం, గోలేటిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకి వెళితే అశోక్‌కు 11 సంవత్సరాల క్రితం రమ్యతో వివాహం కాగా వారికి ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. అశోక్ గత 6 సంవత్సరాలుగా మంథని మండలం, రామయ్యపల్లిలో భార్య, పిల్లలతో కలిసి నివసిస్తూ, అక్కడ మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే, మద్యానికి బానిసైన అశోక్, మద్యం సేవించి ఇంటికి వచ్చిన ప్రతిసారీ తన భార్యతో గొడవపడేవాడు. ఈ విషయంలో అశోక్ తల్లి శశికళ అతడికి అంతలా సర్ది చెప్పిన అశోక్ ప్రవర్తన లో మార్పు రాలేదు. ఇదిలా ఉండగా గత నెల 30వ తేదీన, ఎప్పటిలాగే మద్యం సేవించి ఇంటికి వచ్చిన అశోక్, తన భార్యతో గొడవపడి, రెబ్బెన మండలం, గోలేటిలో నివసిస్తున్న తన తల్లి వద్దకు వచ్చి ఇక్కడే ఉంటున్నాడు. అయితే, సోమవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వచ్చిన అశోక్, రాత్రి 10.30 గంటలకు ఇంట్లోకి వెళ్లి గడియ పెట్టుకున్నాడు. అతని తల్లి అంత పిలిచినా తలుపు తెరవకపోవడంతో, ఇరుగుపొరుగు వారి సహాయంతో తలుపు తెరిచి చూడగా, అతను ఇంట్లోని ఉరి వేసుకుని కనిపించాడు. ఆ తర్వాత 108కి సమాచారం అందించగా, అతడిని అంబులెన్స్‌లో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అశోక్ మరణించినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి శశికళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రెబ్బన ఎస్సై వెంకటకృష్ణ తెలిపారు.

V SAMYUKTHA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :