వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రానికి పర్యటించనున్నారు. మంత్రి ఆకస్మిక పర్యటన నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తూ అధికారులతో సమన్వయం చేస్తున్నారు. పాత మంచిర్యాల 14వ డివిజన్లో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకోనున్నారు. ఓటరు జాబితా సవరణ పారదర్శకంగా, వేగవంతంగా పూర్తయ్యేలా అవసరమైన సూచనలు చేసే అవకాశం ఉంది. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించే ప్రత్యేక సమావేశంలో మంత్రి పాల్గొని పార్టీ కార్యక్రమాలు, స్థానిక అభివృద్ధి అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.
Reporter
వాస్తవ గమ్యం