వాస్తవ గమ్యం / తెలంగాణ / హైద్రాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగే ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ మహా గణపతి, ఈ ఏడాది భక్తులకు సరికొత్త ప్రత్యేక రూపంలో దర్శనమివ్వనున్నారు.ఈ సంవత్సరం స్వామివారిని "పంచముఖ సంకటహర మహాగణపతి" రూపంలో తీర్చిదిద్దుతున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఐదు ముఖాలు (తలలు) కలిగిన ఈ భారీ విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకోనుంది.ఐదు ముఖాలతో శోభిల్లే "పంచముఖ సంకటహర మహాగణపతి" ప్రతి ఏటా సరికొత్త రూపంతో అలరించే ఖైరతాబాద్ వినాయకుడు, ఈసారి ఐదు తలల భారీ రూపంతో భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని పంచనున్నారు.భారీ కాయంతో, భిన్నమైన శైలిలో కొలువుదీరనున్న ఈ పంచముఖ మహాగణపతిని దర్శించుకోవడానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశం నలుమూలల నుంచి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నగర పోలీసులు, ఉత్సవ కమిటీ భారీ ఏర్పాట్లు చేస్తోంది.
Reporter
వాస్తవ గమ్యం