వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల, జూలై 4:మంచిర్యాల జిల్లాలో ఓటర్ల ఎన్యుమరేషన్ ఫారమ్స్ (ఈఎఫ్లు) పంపిణీ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. శనివారం నాటికి జిల్లాలోని మొత్తం 6,61,467 మంది ఓటర్లలో 5,54,954 మందికి ఫారమ్స్ పంపిణీ పూర్తి చేసి 83.90 శాతం పురోగతి సాధించారు.అయితే పంపిణీ చేసిన ఫారమ్స్లో ఇప్పటివరకు కేవలం 12,817 (1.94 శాతం) మాత్రమే డిజిటలైజ్ కావడం ఆందోళన కలిగిస్తోంది. పంపిణీతో పాటు ఫారమ్స్ను వేగంగా ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కూడా సమాంతరంగా పూర్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా పూర్తయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
Reporter
వాస్తవ గమ్యం