వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని 14వ వార్డు, కన్యాలబస్తీలో వెలిసిన శ్రీ ఊరు పోచమ్మ తల్లి దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో ముగిశాయి.ఈ నెల 03-07-2026 (శుక్రవారం) నుండి 05-07-2026 (ఆదివారం) వరకు మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఆదివారం (05-07-2026) ఉదయం 8:05 గంటలకు శతభిష నక్షత్రయుక్త కర్కాటక లగ్న పుష్కరాంశ సుముహూర్తమున ఆలయంలో:శ్రీ ఊరు పోచమ్మ తల్లి,పోతరాజు,జోడు నాగ దేవతల,విగ్రహాలను అర్చకులు చిమిరాల శ్రీనివాస చార్యులు వేదమంత్రాల నడుమ, శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఈ మూడు రోజుల పాటు జరిగిన విశేష పూజలు, హోమాలలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవార్లను దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల రాకతో కన్యాలబస్తీ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో సంతరించుకున్నాయి. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.
Admin
వాస్తవ గమ్యం