వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కల సాకారమవుతోంది. ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి దిశా నిర్దేశంలో, బెల్లంపల్లి నియోజకవర్గంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి శాశ్వత గృహాన్ని అందించడమే లక్ష్యంగా పాలన సాగుతోంది.ఈ క్రమంలో, ఆదివారం నాడు గురజాల గ్రామపంచాయతీ పరిధిలోని డాకూరి సురేష్ నూతనంగా నిర్మించుకున్న గృహప్రవేశ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బెల్లంపల్లి శాసనసభ్యులు గౌరవ శ్రీ గడ్డం వినోద్ వెంకటస్వామి ముఖ్య అతిథిగా హాజరై, రిబ్బన్ కట్ చేసి ఇంటి యజమానిని ఆశీర్వదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నియోజకవర్గంలో ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు పలువురు కీలక నేతలు పాల్గొన్నారు కారుకూరి రామ్ చందర్ (మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్) నాతరి స్వామి (రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్) వంగ రామన్న (గురజాల సర్పంచ్),సాగర్ల లక్ష్మణ్ (లంబాడి తండా సర్పంచ్),బాలు యాదవ్ (యువజన కాంగ్రెస్ సోషల్ మీడియా కోఆర్డినేటర్),మరియు కాంగ్రెస్ నాయకులు తోట నరేష్, ఆరేపల్లి సురేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని నూతన గృహస్తులకు శుభాకాంక్షలు తెలిపారు.
Admin
వాస్తవ గమ్యం