Tuesday, 28 July 2026 12:59:52 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

Date : 22 July 2026 05:53 PM Views : 21

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. బుధవారం నస్పూర్ కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సీఐ రవీందర్‌తో కలిసి సందర్శించిన ఆయన, సీసీ కెమెరాల ఏర్పాటు, భోజనశాల, వంటశాల, అదనపు గదుల నిర్మాణ పనులను పరిశీలించారు.బాలికల భద్రతకు ప్రాధాన్యమిస్తూ పాఠశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహారం, స్వచ్ఛమైన తాగునీరు అందించాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఇంటర్మీడియట్ బీపీసీ విద్యార్థులతో మాట్లాడి బోధన నాణ్యతపై వివరాలు తెలుసుకున్నారు.అనంతరం నస్పూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్‌ను వేగవంతం చేయాలని, అర్హులందరి పేర్లు ఓటరు జాబితాలో నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియపై కూడా సమీక్ష నిర్వహించారు.మందమర్రి, బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించిన కలెక్టర్, ఓటరు జాబితా సవరణ, భూభారతి, సాదా బైనమా దరఖాస్తుల పరిష్కారంపై అధికారులకు పలు సూచనలు చేశారు. బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్‌తో కలిసి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు.తదనంతరం కాసిపేట, తాండూర్ ప్రాంతాల్లో సింగరేణి నూతన ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టుల కోసం ప్రతిపాదిత స్థలాలను సంబంధిత అధికారులు, సింగరేణి జనరల్ మేనేజర్లతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాల్లో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

KAGITHAPU SRINIVAS

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :