వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : పెళ్లి కావడం లేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని అందుగులపేటలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. అందుగులపేటకు చెందిన కొమ్ము రాజు (32) ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. వివాహం కోసం ఎన్ని సంబంధాలు చూసినా కుదరకపోవడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నాడు. మంగళవారం ఉదయం కుటుంబ సభ్యులు బయటకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో కుటుంబ సభ్యులు కిటికీలోంచి చూడగా ఉరివేసుకుని కనిపించాడు. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లే సరికి రాజు మృతి చెంది ఉన్నాడు. మృతుడి తమ్ముడు కొమ్ము సాగర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Reporter
వాస్తవ గమ్యం