వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : యోగ సాధన ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని,అనేక రకాల రుగ్మతలను నివారించుకోవచ్చని లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ చైర్మన్ సోత్కు సుదర్శన్, డైరెక్టర్ పుస్కూరి నర్సింగరావు చైర్ పర్సన్ పోలు శ్రీనివాస్, అన్నారు. విలేజ్ మందమర్రిలోని రామాలయం సమీపంలో నిర్వహిస్తున్న ఉచిత యోగ శిక్షణ కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు. నరసింగరావు–ప్రణతి దంపతుల ఆధ్వర్యంలో, మీనాక్షి యోగ, పిరమిడ్ ధ్యాన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యోగ పట్ల ప్రతి ఒక్కరూ ఆసక్తి పెంచుకుని దానిని నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. యోగతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు జీవనశైలి వ్యాధులను కూడా నియంత్రించుకోవచ్చన్నారు.యోగ శిక్షణ కార్యక్రమం ముగియనున్న నేపథ్యంలో, మందమర్రి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణలో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అదేవిధంగా ఈ శిక్షణలో పాల్గొన్న పిల్లలందరికీ యోగ పట్ల ఆసక్తి చూపాలని కన్సిలేషన్ బహుమతులను అందజేశారు.ఈ కార్యక్రమంలో యోగ మాస్టర్లు కొంపెల్లి లలిత, మీనాక్షి, లైన్స్ క్లబ్ సెక్రటరీ జాకీర్ హుస్సేన్, తాడికొండ లూథర్ భూపాల్, బింగి రాజన్న,ఆలయ పూజారి,తదితరులు, పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం