Sunday, 13 September 2026 06:49:44 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

మంచిర్యాలలో ఘనంగా ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు

Date : 26 June 2026 05:34 PM Views : 177

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని చార్వక ఈఎన్‌టీ ట్రస్ట్‌లో బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా సాహు మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి, ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ​ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బీఎస్పీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు ముల్కల్ల రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ. కొల్హాపూర్ సంస్థానంలో మెజారిటీ ప్రజలైన బహుజనులకు రిజర్వేషన్లు కల్పించి, ఆ సంస్థానాన్ని సామాజిక సంస్థానంగా మార్చిన ఘనత సాహు మహారాజ్‌దేనని కొనియాడారు. బుద్ధుడు,కబీర్, మహాత్మా జ్యోతిబాఫులే ఆశయాలను ఆయన ఆచరణలో చూపెట్టారని పేర్కొన్నారు.బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నత విద్యకు సాహు మహారాజ్ ఎంతో సహకారం అందించారని,ఆయన నడిపిన మూక్ నాయక్ పత్రికకు అండగా నిలిచారని గుర్తుచేశారు.1920 మార్చి 22న జరిగిన దక్కన్ అస్పృశ్య సమాజ సమ్మేళన సభలోనే.భవిష్యత్తు అంబేద్కర్‌ ఆశయాలతోనే ముందుకు సాగుతుందని సాహు మహారాజ్ ప్రకటించారని వివరించారు. తన సంస్థానంలో బహుజనులకు ఉద్యోగాలిస్తూ, భూములకు పట్టాలు ఇచ్చారని.గంగారాం కాంబ్లే అనే వ్యక్తి హోటల్ పెట్టుకోవడానికి ఆర్థిక సాయం అందించడమే కాకుండా, స్వయంగా వెళ్లి అక్కడ టీ తాగిన గొప్ప సంస్కర్త ఆయనని కొనియాడారు. సమాజంలో వితంతు వివాహ చట్టాన్ని తీసుకువచ్చి, కులాంతర వివాహాలను ప్రోత్సహించారని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు. ​ఈ వేడుకల్లో బీఎస్పీ మంచిర్యాల నియోజకవర్గ అధ్యక్షుడు బండారి రాజ్ కుమార్, చెన్నూరు నియోజకవర్గ అధ్యక్షుడు గాజుల శంకర్, బెల్లంపల్లి నియోజకవర్గ ఇంచార్జ్ గోమాస బ్రహ్మానందం, జిల్లా నాయకులు పేట్టెం చంద్రశేఖర్, దుర్గం గంగారాం, కుమ్మరి కృష్ణ చైతన్య, ముల్కల్ల జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

BEERAM SHARATH CHANDHRA

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: