వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : ఆసిఫాబాద్ స్కూల్ కాంప్లెక్స్ పరిధిలోని రవిచంద్ర కాలనీ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోట్బుక్కులు పంపిణీ చేశారు. స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు పవార్ లింబారావ్, ఎస్సీఆర్పీ రాథోడ్ రవీందర్, ఉపాధ్యాయుడు జాదవ్ ప్రఫుల్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించిన పుస్తకాలు అందజేస్తూ విద్య ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై బాగా చదివి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఉపాధ్యాయులు విద్యార్థులను ప్రోత్సహించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం