వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల: ప్రపంచ హెపటైటిస్ బి దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆధ్వర్యంలో సోమవారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. నరేందర్ రాథోడ్ ర్యాలీకి నాయకత్వం వహించి ప్రజల్లో హెపటైటిస్ బిపై అవగాహన పెంపొందించాల్సిన అవసరాన్ని వివరించారు. హెపటైటిస్ బి నివారణకు సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, సకాలంలో పరీక్షలు చేయించుకోవడం, సురక్షితమైన సూదులు వినియోగించడం ద్వారా ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం