Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 13 నుంచి 18 వరకు “అరైవ్-అలైవ్” కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు సూచించారు. హైదరాబాద్లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో డిజిపి శివధర్ రెడ్డి సహా ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో రహదారి భద్రతపై సమీక్షించారు.ప్రతి గ్రామపంచాయతీ, మున్సిపాలిటీలో రహదారి భద్రతపై గ్రామ సభలు నిర్వహించి కమిటీల ఏర్పాటు చేయాలని తెలిపారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలతో భద్రత ప్రతిజ్ఞ చేయించాలని, డ్రైవర్లకు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. హెల్మెట్, సీట్బెల్ట్ వినియోగంపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ప్రతి నెల సమావేశాలు నిర్వహించి ప్రమాదాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాలో కార్యక్రమాన్ని సమన్వయంతో విజయవంతంగా అమలు చేస్తామని కలెక్టర్ హరిత తెలిపారు.
Admin
Vastava Gamyam