వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 18వ డివిజన్ గుడిపేటలో కేంద్రీయ విద్యాలయంలో నిర్వహించిన విద్యార్థి మండలి పదవీ స్వీకారోత్సవానికి జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన విద్యార్థి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి బాధ్యతలు అప్పగించారు.ఈ సందర్భంగా విద్యార్థులు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు, క్రమశిక్షణ, బాధ్యతాయుత ఆలోచనా విధానం, సేవాభావాన్ని. పెంపొందించుకోవాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సమస్యలను తెలుసుకుని, అభివృద్ధిలో భాగస్వాములై తోటి విద్యార్థులకు మార్గదర్శకంగా నిలవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మేయర్ ధర్ని మధుకర్, ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం