వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : 2025 ఖరీఫ్ సీజన్ సి ఎం ఆర్ బియ్యంను నిర్ణీత గడువులోగా అందించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ తో కలిసి 2025 ఖరీఫ్ సి ఎం ఆర్ బియ్యం, వరి ధాన్యం దిగుమతి పై రైస్ మిల్లర్ల యాజమాన్యంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 2025 ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన బియ్యాన్ని రైస్ మిల్లర్లు నిర్ణీత గడువులోగా ప్రభుత్వానికి అందించాలని తెలిపారు. 2025-26 యాసంగి వరి ధాన్యం కొనుగోలు చేపట్టడం జరిగిందని, అర్హత గల బాయిల్డ్ రైస్ మిల్లర్లు, రా రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని, ప్రక్రియలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హమాలీల కొరత లేకుండా సర్దుబాటు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రజిత, అధికారులు, రైస్ మిల్లుల యజమానులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం