Vastava Gamyam - తెలంగాణ / కరీంనగర్ : కొండగట్టు పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఈవో అంజనారెడ్డి తెలిపారు. భక్తుల సేవకు అదనంగా 500 మంది అర్చకులు, కేశఖండనకు 1500 మంది క్షురకులను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే కోనేరులో ప్రతి 3 గంటలకు ఒకసారి నీరు మారుస్తామని, మంచినీరు, ప్రసాదాలకు కొరత లేకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో 3 రోజుల ఉత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
Reporter
Vastava Gamyam