వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూర్ పట్టణంలో నిలిచిపోయిన రోడ్డు విస్తరణ పనులు, ప్రజా సమస్యలపై ప్రజావాణిలో బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు.అంబేద్కర్ చౌక్ నుండి రావిచెట్టు వరకు అర్ధాంతరంగా ఆగిపోయిన రోడ్డు విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ డిమాండ్ చేశారు.మున్సిపల్ అధికారులు ఎలాంటి స్పష్టత లేకుండా రోడ్డు వెడల్పు పనులను ప్రారంభించి, నాలుగు నెలలు గడుస్తున్నా పూర్తి చేయడం లేదని ఈ సందర్భంగా అన్నారు.రోడ్డు వెడల్పు, డ్రైనేజీ నిర్మాణం, లైటింగ్ వ్యవస్థపై ప్రజలకు స్పష్టమైన వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.రోడ్ల కూల్చివేతల వల్ల పేరుకుపోయిన శిథిలాలను తొలగించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, దీనివల్ల వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.చిన్నపాటి వర్షానికే డ్రైనేజీ నీరు ఇళ్లలోకి చేరుతోందని, ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.మంత్రి వివేక్ వెంకటస్వామి వెంటనే స్పందించి పనులను వేగవంతం చేయాలని, లేనిపక్షంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం అశోక్ కౌన్సిలర్.గర్రబెల్లి శాంత వెంకట నరసయ్య పట్టణ ప్రధాన కార్యదర్శి కాగిత వెంకటేష్ మౌనిక రౌతు శంకర్ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు రాపర్తి వెంకటేశ్వర్ సీనియర్ నాయకులు కొండపాక చారి తలారి రాజులు తుమ్మ చిరంజీవి ఆడప శ్రీనివాస్ గడ్డం మల్లయ్య వెంకట్ రాజన్న శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
వాస్తవ గమ్యం