Wednesday, 29 July 2026 05:40:49 PM
# అసభ్యంగా ప్రవర్తించిన అధికారిపై చర్యలు తీసుకోవాలి # అన్నివేళలా రోగులకు అందుబాటులో ఉండాలి # తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.

బిఆర్ఎస్ నేతల విమర్శలు హాస్యాస్పదం: చెన్నూరు కాంగ్రెస్ నాయకులు

Date : 04 May 2026 04:07 PM Views : 227

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న శరవేగంగా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పట్టణంలో సిమెంటు రోడ్లు, సోలార్ హైమాస్ లైట్ల ఏర్పాటుతో పాటు 100 పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభం కాబోతుందని వారు తెలిపారు.అంబేద్కర్ చౌక్ నుండి కోటపల్లి బస్ స్టాప్ వరకు 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరిస్తుంటే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచనతో కొందరు నేతలు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గతంలో నోటీసులు ఇవ్వకుండానే క్యాంప్ ఆఫీస్ ముందు చిన్న వ్యాపారులను తొలగించిన చరిత్ర బాల్క సుమన్‌దని, 2019లో రోడ్డు వెడల్పు చేస్తానని చెప్పి వ్యాపారుల ప్రలోభాలకు లొంగి ఆ పనులను అప్పట్లో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.మహంకాళి వాడలో రైతుల ఇళ్లను కూలగొట్టినప్పుడు లేని 'నోటీసుల' నియమం ఇప్పుడే గుర్తొచ్చిందా అని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డిని నిలదీశారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో మూడు సార్లు చర్చించి, అందరికీ నోటీసులు ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, పెండ్యాల సాగర్, అజ్జు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :