Saturday, 13 June 2026 10:42:41 AM
# ఘనంగా రామ్ ప్రసాద్ బిస్మిల్ జయంతి # ​కోటపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన # పేద విద్యార్థుల చదువుల్లో వెలుగులు # *అకెనపల్లిలో గుట్టుచప్పుడు కాకుండా గ్రామసభ.. # గెలిచిన సంఘాల చేతగానితనంతోనే సింగరేణిలో నిలిచిన మెడికల్ బోర్డు: # ​గంగాపూర్ గేట్ ROB భూ సర్వే పూర్తి: గవర్నర్, # ​ఆదివాసీ భూములను లాక్కునే కుట్ర మానుకోవాలి: TAGS # ​మందమర్రిలో ఘనంగా ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ గ్రామ సభ # మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్యంపై దాడి # సింగరేణి కాలరీస్ హైస్కూల్ (కల్యాణిఖని)లో ప్రవేశాలు ప్రారంభం # నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై పార్లమెంట్‌లో నిలదీస్తాం # 16 ఏళ్ల తర్వాత ఒక్కటైన జెడ్పీహెచ్‌ఎస్ తాండూర్ 2010 బ్యాచ్ విద్యార్థులు! # ​మందమర్రి హెడ్ కానిస్టేబుల్ సురేందర్‌కు సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రశంసలు # టీపీసీసీ ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా చందనగిరి శ్రీనివాస్.. # కన్నాలలో ‘అమృత్ 2.0’ పనుల పరిశీలన # ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు నమోదు ముమ్మరం # తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి # యోగ పట్ల ప్రతి ఒక్కరు ఆసక్తి పెంచుకోవాలి... # అగ్నిప్రమాద బాధితులకు ఆర్థిక సాయం # కలెక్టర్‌ను కలిసిన బెల్లంపల్లి ఏరియా జీఎం

బిఆర్ఎస్ నేతల విమర్శలు హాస్యాస్పదం: చెన్నూరు కాంగ్రెస్ నాయకులు

Date : 04 May 2026 04:07 PM Views : 190

Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : చెన్నూరు మున్సిపల్ పట్టణంలో జరుగుతున్న శరవేగంగా అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బిఆర్ఎస్ నాయకులు అనవసర విమర్శలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. పట్టణంలో సిమెంటు రోడ్లు, సోలార్ హైమాస్ లైట్ల ఏర్పాటుతో పాటు 100 పడకల ఆసుపత్రి త్వరలో ప్రారంభం కాబోతుందని వారు తెలిపారు.అంబేద్కర్ చౌక్ నుండి కోటపల్లి బస్ స్టాప్ వరకు 60 ఫీట్ల రోడ్డు వెడల్పు పనులకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా సహకరిస్తుంటే, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సూచనతో కొందరు నేతలు వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.గతంలో నోటీసులు ఇవ్వకుండానే క్యాంప్ ఆఫీస్ ముందు చిన్న వ్యాపారులను తొలగించిన చరిత్ర బాల్క సుమన్‌దని, 2019లో రోడ్డు వెడల్పు చేస్తానని చెప్పి వ్యాపారుల ప్రలోభాలకు లొంగి ఆ పనులను అప్పట్లో ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.మహంకాళి వాడలో రైతుల ఇళ్లను కూలగొట్టినప్పుడు లేని 'నోటీసుల' నియమం ఇప్పుడే గుర్తొచ్చిందా అని మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూలా రాజిరెడ్డిని నిలదీశారు మంత్రి వివేక్ వెంకటస్వామి ఆధ్వర్యంలో వ్యాపారస్తులతో మూడు సార్లు చర్చించి, అందరికీ నోటీసులు ఇచ్చాకే రోడ్డు విస్తరణ చేపట్టామని స్పష్టం చేశారు. ​ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నాయకపు వినయ్ కుమార్, కౌన్సిలర్లు అంబటి శంకర్, పెండ్యాల సాగర్, అజ్జు మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి చింతల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

KOMMU RAJESH

Admin

Vastava Gamyam

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :