వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : మందమర్రి: సింగరేణికి చెందిన విలువైన స్క్రాప్ను అక్రమంగా నిల్వ చేసి తరలిస్తున్న ముఠాపై సింగరేణి ఎస్అండ్పీసీ (సెక్యూరిటీ అండ్ పోలీస్ కోఆర్డినేషన్) సిబ్బంది మంగళవారం ఆకస్మికంగా దాడి చేసి సుమారు 2 టన్నుల సింగరేణి స్క్రాప్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన మందమర్రి పట్టణంలోని విద్యానగర్లో ఉన్న హనుమంతు స్క్రాప్ దుకాణంలో చోటుచేసుకుంది.సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్రావు తెలిపిన వివరాల ప్రకారం, సింగరేణికి చెందిన స్క్రాప్ను ఓ వ్యాన్లో అక్రమంగా తరలిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అందడంతో వెంటనే జూనియర్ ఇన్స్పెక్టర్ ఓదేలు, ఐడీ పార్టీ సభ్యుడు మల్లేశ్తో కలిసి దాడి నిర్వహించారు. ఈ దాడిలో సుమారు రెండు టన్నుల సింగరేణి స్క్రాప్ను స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్క్రాప్ విలువ, అది ఏ గని ప్రాంతం నుంచి అక్రమంగా తరలించబడిందనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. సింగరేణి ఆస్తులను అక్రమంగా కొనుగోలు, నిల్వ లేదా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.
Reporter
వాస్తవ గమ్యం