Tuesday, 28 July 2026 01:00:01 PM
# కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం # 54 మందికి ఉచిత కంటి ఆపరేషన్లు విజయవంతం. # జైపూర్ ఎంపీపీ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం.

జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం

12వ ఆవిర్భావ వేడుకల్లో కేక్ కట్ చేసిన జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్.

Date : 23 July 2026 06:59 PM Views : 17

వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం, సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ నిరంతరం పోరాడుతోందని టిజెఎ జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో గురువారం తెలంగాణ జర్నలిస్టు అసోసియేషన్ (టిజెఎ) 12వ ఆవిర్భావ వార్షికోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ ఆదేశాల మేరకు, రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ నేతృత్వంలో ఈ వేడుకలను వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జర్నలిస్టులు వృద్ధులకు అన్నదానం చేసి తమ మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. అనంతరం అసోసియేషన్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు పార్వతి సురేష్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి వేడుకలను అధికారికంగా ప్రారంభించారు. ఈ వేడుకల్లో జిల్లాలోని జర్నలిస్టు నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.రాష్ట్రంలోని జర్నలిస్టులందరినీ ఒకే తాటిపైకి తెచ్చి వారి ఐక్యతను చాటడంలో టిజెఎ కీలక పాత్ర పోషిస్తోందని నాయకులు పేర్కొన్నారు. సంస్థను రాష్ట్రవ్యాప్తంగా అగ్రగామిగా, బలమైన శక్తిగా తీర్చిదిద్దడంలో వ్యవస్థాపక అధ్యక్షుడు ఉప్పల లక్ష్మణ్ అందిస్తున్న సేవలు, క్రమశిక్షణ అభినందనీయమని కొనియాడారు. భవిష్యత్తులోనూ జర్నలిస్టుల సంక్షేమానికి, వృత్తిపరమైన రక్షణకు టిజెఎ అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో టిజెఎ జిల్లా నాయకులు సారంగరావు,డేగ ఆంజనేయులు,గట్టయ్య, గంగులు,అమర్నాథ్ రెడ్డి,గౌతం,పురుషోత్తం, ప్రేమ్ జీవన్,సతీష్,వినీత్, సభ్యులు, స్థానిక జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

MANTHRI GAJANAND

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :