Vastava Gamyam - తెలంగాణ / మంచిర్యాల : బెల్లంపల్లి మండల పరిధిలోని అకెనపల్లి గ్రామంలో అధికారులు నిర్వహించిన గ్రామసభ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గ్రామసభ నిర్వహించేటప్పుడు ప్రజలకు స్పష్టంగా తెలిసేలా సభ ఉద్దేశాన్ని వివరించే బ్యానర్లు, పోస్టర్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కానీ, అకెనపల్లిలో ఎలాంటి ముందస్తు ప్రచారం గానీ, కనీసం ఒక బ్యానర్ కూడా పెట్టకుండానే అధికారులు సభను నిర్వహించారు. సభ జరుగుతున్న విషయమే చాలా మంది గ్రామస్థులకు తెలియకుండా పోయిందని, కేవలం కొద్దిమందితోనే సభను ముగించడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పథకాలు, గ్రామ అభివృద్ధి పనులపై చర్చించాల్సిన సభను ఇంత రహస్యంగా ఎందుకు నిర్వహించాల్సి వచ్చిందని అధికారుల తీరుపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనల ప్రకారం అందరికీ సమాచారం అందించి తిరిగి గ్రామసభను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.
Admin
Vastava Gamyam