వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : తెలంగాణలో కార్మికులకు మూడు జోన్ల వారీగా కనీస వేతనాలు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తమవుతోంది. మందమర్రి పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామిల చిత్రపటాలకు మున్సిపల్ కార్మికులు, నాయకులు ఘనంగా పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు బండి సదానందం యాదవ్ హాజరయ్యారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మంద తిరుమల్ రెడ్డి, నాయకులు నోముల ఉపేందర్ గౌడ్, గోపతి భానేష్, పుల్లూరి లక్ష్మణ్ తదితరులు మాట్లాడుతూ.స్వర్గీయ కాకా వెంకటస్వామి కాలం నుండి నేటి మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ గడ్డం వంశీకృష్ణల వరకు వారి కుటుంబం ఎల్లప్పుడూ కార్మికుల పక్షానే నిలిచిందని కొనియాడారు.మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబులతో చర్చించి వేతనాలు పెంచేలా కృషి చేశారని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని 1.11 కోట్ల కార్మిక కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, పేదల పక్షాన నిలిచే ప్రజా ప్రభుత్వానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ కమిటీ ప్రతినిధులు, వివిధ విభాగాల నాయకులు, 24 వార్డుల కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
వాస్తవ గమ్యం