వాస్తవ గమ్యం / తెలంగాణ / మంచిర్యాల : శ్రీరాంపూర్లోని ఎస్ఆర్పీ-3 భూగర్భ గనిలో సోమవారం మరో ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్రామర్ కార్మికుడు చుంచు పోశమల్లు తీవ్రంగా గాయపడ్డాడు. తొలి షిఫ్ట్లో త్రీ సీమ్ ఎండ్స్ ప్రాంతంలో ఖాళీ టబ్బును తరలిస్తున్న సమయంలో ప్రమాదం సంభవించగా, అతని కుడికాలు విరిగినట్లు సమాచారం.ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన సహచర కార్మికులు బాధితుడిని తొలుత రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కరీంనగర్లోని ప్రత్యేక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.ఇటీవల ఎస్ఆర్పీ-3 గనిలో వరుసగా ప్రమాదాలు చోటుచేసుకోవడం గని కార్మికుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. భద్రతా ప్రమాణాలను మరింత కట్టుదిట్టం చేయాలని, ప్రమాదాల నివారణకు యాజమాన్యం తక్షణ చర్యలు చేపట్టాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.
Reporter
వాస్తవ గమ్యం