వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం దుగ్గాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిర్యాని తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ పాల్గొని గ్రామస్తులకు సమగ్ర భూ సర్వే ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి రైతు భూమికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించడం, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించడమే ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూముల వద్ద హాజరై అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. సర్వేయర్ అజయ్ సమగ్ర భూ సర్వే నిర్వహించే విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, హద్దుల గుర్తింపు ప్రక్రియ, రైతులు పాటించాల్సిన సూచనలను గ్రామస్తులకు వివరించారు. గ్రామస్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు
Reporter
వాస్తవ గమ్యం