Sunday, 13 September 2026 06:49:08 PM
# హరిహర దేవస్థానంలో ఘనంగా సంతోషిమాత ఉద్వాసన మహోత్సవం # జంగలి.రవీందర్‌ అంతిమయాత్రలో డప్పు కొట్టిన మాజీ ఎమ్మెల్యేలు # మందమర్రి కేకే ఓసీలో అధికారులకు ఘనంగా వీడ్కోలు, స్వాగత సన్మానం # మంచిర్యాలలో జనసేనలోకి భారీ చేరికలు. # సెకండ్ ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించాలి: రవి పటేల్ # పంట సర్వే వాలంటీర్ల సమస్యలు పరిష్కరించాలి. # ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించిన బిఆర్ఎస్ నాయకులు. # ఓబీసీ కమిటీల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ # అనారోగ్య బాధిత కుటుంబాలకు సి ఎం ర్ ఫ్ ఆపన్నహస్తం 286 మంది లబ్ధిదారులకు రూ.1.05 కోట్లకు పైగా చెక్కుల పంపిణీ # లయన్స్ క్లబ్ ఆఫ్ గోలేటి స్పోర్ట్స్ ఆధ్వర్యంలో సన్మానం # ఖైరగుడా ఓసీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి # వివాహ వేడుకలకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించిన నాతరి స్వామి # గోదావరి నదిని పరిశుభ్రంగా ఉంచుదాం. # రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలిగా నూగురు అనుపమ # రెబ్బెనలో 130 గ్రాముల గంజాయి పట్టివేత # *పవర్‌గూడా అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి* *ఎమ్మెల్యే కోవలక్ష్మికి వినతిపత్రం # బీసీ మహిళా మంత్రిని పదవి నుంచి తొలగించడం తీవ్రంగా ఖండిస్తున్నాం # రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారు: సురేఖ # కొండా సురేఖ బర్తరఫ్కు సీఎం ఆదేశం.. గవర్నరు లేఖ # సీపీఆర్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన వైద్య దంపతులు

రైతులకు శుభవార్త..భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.

సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించిన తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్*

Date : 16 July 2026 02:57 PM Views : 129

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం దుగ్గాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిర్యాని తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ పాల్గొని గ్రామస్తులకు సమగ్ర భూ సర్వే ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి రైతు భూమికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించడం, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించడమే ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూముల వద్ద హాజరై అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. సర్వేయర్ అజయ్ సమగ్ర భూ సర్వే నిర్వహించే విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, హద్దుల గుర్తింపు ప్రక్రియ, రైతులు పాటించాల్సిన సూచనలను గ్రామస్తులకు వివరించారు. గ్రామస్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: