Tuesday, 28 July 2026 05:29:55 PM
# తెలంగాణ రక్షణ సేన పెద్దపల్లి పార్లమెంట్ ఇన్‌చార్జిగా తిప్పారపు సారయ్య # హెపటైటిస్ బిపై అవగాహన ర్యాలీ # కుమురం భీం జిల్లా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లు ఘన విజయం # మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు చొరవతో పటేల్ గూడలో రేకు షెడ్ నిర్మాణానికి భూమి పూజ # ప్రతి ఇంటికీ మొక్కలు పంపిణీ – పచ్చని ఎదులపాడ్ నిర్మాణమే లక్ష్యం # కీ॥శే. శ్రీ సంత్ కుమ్ర దేవ్ రావు మహారాజ్ మాడిస్ పూజలో పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క # నీట్ పేపర్ లీకేజీ బాధిత విద్యార్థులకు కొవ్వొత్తుల ర్యాలీలో నివాళి # మద్యం మత్తులో బైక్‌ అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టిన ఘటన # కోదండ రామాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల ప్రత్యేక పూజలు # *మాజీ ఎమ్మెల్యే ఆత్రంసక్కు చొరవతో షేడ్ నిర్మాణానికి భూమిపూజ* # *ఆశ్రమ పాఠశాలలో స్మాట్ బోర్డ్ ప్రారంభించిన స్థానిక సర్పంచ్ జనేరావు. # కేటీఆర్ జన్మదినం.. సేవా కార్యక్రమాలతో బీఆర్ఎస్ నేతల వినూత్న వేడుకలు # ఎస్ఐఆర్ డిజిటలైజేషన్ గడువులోగా పూర్తి చేయాలి: # అభివృద్ధి పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి: # సీఎంఆర్ బకాయిలను తక్షణమే పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ వి. రాములు # జర్నలిస్టుల హక్కుల రక్షణే టీజేఏ దేయం # ప్రజల అభిమానాన్ని చూరగొన్న ధారావత్ శంకర్ నాయక్‌కు ఘన సన్మానం – భావోద్వేగ వీడ్కోలు* # ప్రజాస్వామ్యం మీద గౌరవం లేని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. # పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటాలి. # చెన్నూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జాతీయ పతాక దత్తత దినోత్సవం

రైతులకు శుభవార్త..భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం.

సమగ్ర భూ సర్వేపై అవగాహన సదస్సు నిర్వహించిన తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్*

Date : 16 July 2026 02:57 PM Views : 98

వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : తిర్యాని కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా తిర్యాని మండలం దుగ్గాపూర్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమంపై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో తిర్యాని తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ పాల్గొని గ్రామస్తులకు సమగ్ర భూ సర్వే ప్రాముఖ్యతను వివరించారు.ఈ సందర్భంగా తహసీల్దార్ ఆర్. శ్రీనివాస్ మాట్లాడుతూ, ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న భూ హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడం, ప్రతి రైతు భూమికి ఖచ్చితమైన హద్దులను నిర్ణయించడం, భూ రికార్డులను పారదర్శకంగా రూపొందించడమే ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. సర్వే సమయంలో భూ యజమానులు తమ భూముల వద్ద హాజరై అధికారులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. సర్వేయర్ అజయ్ సమగ్ర భూ సర్వే నిర్వహించే విధానం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, హద్దుల గుర్తింపు ప్రక్రియ, రైతులు పాటించాల్సిన సూచనలను గ్రామస్తులకు వివరించారు. గ్రామస్తుల సందేహాలకు సమాధానాలు ఇచ్చి సర్వే ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు

MULAMATAM SHIVA PRASAD

Reporter

వాస్తవ గమ్యం

మరిన్ని వార్తలు

Copyright © Vastava Gamyam 2026. All right Reserved.



Developed By :