Vastava Gamyam - తెలంగాణ / ఆసిఫాబాద్ : కుమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం భంబారా గ్రామంలో శుక్రవారం ఆచార్య జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లల గుర్తింపు, వివరాల నమోదు కార్యక్రమం నిర్వహించారు. పీఎంఆర్సీ ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ ఆధ్వర్యంలో ఎస్సీఆర్పీలు, ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి పాఠశాల వయస్సు గల ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలను గుర్తించి వారి వివరాలను నమోదు చేశారు.ఈ సందర్భంగా పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం ప్రభుత్వం ప్రత్యేక పాఠశాలలు, ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంచిందని తెలిపారు. గుర్తింపు, నమోదు ప్రక్రియను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
Admin
Vastava Gamyam