వాస్తవ గమ్యం / తెలంగాణ / ఆసిఫాబాద్ : కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో శనివారం ఘోర హత్య కలకలం రేపింది. జిల్లాలోని రెబ్బెన మండలంలో ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.హత్య సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్ టీంతో కలిసి ఆధారాలు సేకరిస్తున్నారు.మృతుడిని నారాయణపూర్ గ్రామానికి చెందిన వేమునూరు స్వామిగా పోలీసులు గుర్తించారు.ఈ హత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పాత కక్షలు, వ్యక్తిగత విభేదాల వల్లే ఈ హత్య జరిగిందా? లేక మరేదైనా బలమైన కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.ఈ దారుణ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుల సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరిన్ని వివరాలు త్వరలో...
Admin
వాస్తవ గమ్యం